కాంగ్రెస్ అద్భుతం చేయబోతుంది: బండ్ల గణేష్ జోస్యం

కాంగ్రెస్ అద్భుతం చేయబోతుంది: బండ్ల గణేష్ జోస్యం

ఇప్పుడే షాద్ నగర్ కు వెళ్ళి వచ్చానని.. మిత్రుడు వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టిందని.. జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సీని నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ అన్నారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు.. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరని అన్నారు. 2023, నవంబర్ 30వ తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని.. కాంగ్రెస్ అద్భుతం సృష్టించబోతుందని ఆయన చెప్పారు. 2023, నవంబర్ 8వ తేదీ బుధవారం బండ్ల గణేష్ నాంపల్లిలోని గాంధీ భవన్ కు వళ్లారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని.. ఇంతవరకు కాంగ్రెస్ కి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని చెప్పారు.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందని.. ఇప్పుడు దేశం కోసం రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీలు సేవ చేస్తున్నారని అన్నారు బండ్ల గణేష్. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అన్నిటికి తెగించి తెలంగాణ ఇచ్చింది అమ్మ.. సోనియా గాంధీ అని అన్నారు. రాబోయే రోజుల్లో  రాహుల్ గాంధీ  తెలంగాణాలోనే మాకాం వేస్తారని చెప్పారు.రాహుల్ గాంధీ ఏనాడు హద్దులు దాటి మాట్లాడలేదన్నారు. బీఆరెస్ లో మంత్రులు ఎవరు.. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదని..  డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని బండ్ల గణేష్ పేర్కొన్నారు.