ఇండ్ల జోలికి పోకుండా బంజారా లేక్ పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ఇండ్ల జోలికి పోకుండా బంజారా లేక్ పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పర్యటన

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానికుల ఫిర్యాదు మేరకు మొదట తాజ్ బంజారా లేక్​ను పరిశీలించారు. చెరువులోకి నేరుగా మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధిలో రోడ్డు నిర్మించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం, వ్యర్థాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంతో ఈ పరిస్థితికి వచ్చిందని తెలుసుకున్నారు.

బంజారాలేక్ పై భాగంలో ప్రభుత్వ భూమి ఉందని, దాన్ని కాపాడడంతో పాటు చెరువు పున‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుద్ధర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్​తయారు చేస్తామన్నారు. ఇండ్ల జోలికి పోకుండా చెరువును ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. నాలాలను మూసివేసి వరద ముప్పునకు కారణమయ్యే నిర్మాణాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తర్వాత శంషాబాద్ మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం మామిడిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల్లో నాలుగైదు చెరువులు మాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని  స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఒంగోని కుంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యకుంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్రివానికుంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎర్రకుంటలో కొన్నింటిని పూర్తిగా ఆక్రమించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాన్ని సీరియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్​గా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణించారు. ఇరిగేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి చెరువులు, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద కాలువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పూర్తి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాచారం సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. ఆక్రమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశాన్ని ఏర్పాటు చేసి క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్జాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, లేకపోతే హైడ్రా నేరుగా రంగంలోకి  దిగుతుందన్నారు.