హయత్ నగర్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్

హయత్ నగర్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర(బీవోఎం​) సిటీలో మరో కొత్త బ్రాంచ్​ను ప్రారంభించింది. బుధవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి హయత్ నగర్ బ్రాంచ్​ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీలో కొత్త బ్రాంచ్​ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బ్రాంచ్​తో మా కస్టమర్లకు మరింత దగ్గరవుతున్నామన్నారు.

బ్యాంకింగ్ రంగంలో బీవోఎం సేవలకు గాను పలు అవార్డులు వచ్చాయన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో బీవోఎంకు 64, దేశంలో మొత్తం 2,200 బ్రాంచ్​లున్నాయని రోహిత్ పేర్కొన్నారు. దాదాపు 30 మిలియన్ల కస్టమర్లకు బీవోఎం సేవలందిస్తోందన్నారు. బ్రాంచ్ ఓపెనింగ్​కు వచ్చిన ప్రముఖులకు, కస్టమర్లకు హయత్ నగర్ బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ సుశాంత్ గుప్తా, డిప్యూటీ జోనల్ మేనేజర్ మహ్మద్ షజీబ్ పాల్గొన్నారు.