యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో వి గురుమూర్తి తెరకెక్కించిన సినిమా ‘శిఖండి’. పోలా ప్రవీణ్ కుమార్ నిర్మాత. సోమవారం టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో యువరాజ్ గౌడ మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు ఈ చిత్రంపై నాకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.
టీజర్ చూశాక వందరెట్లు నమ్మకం పెరిగింది. మేము ‘శిఖండి’ సినిమా చేశామని గర్వంగా చెప్పుకుంటాం. మహాభారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం’ అని అన్నాడు. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని ఇతర నటీనటులు చెప్పారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ -‘మహాభారతంలోని ‘శిఖండి’ పాత్ర నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.
మహాభారతంలోని ఈ పాత్రకు ఇప్పటి కలియుగంలోని కథకు ముడిపెడుతూ ఎలా సినిమా చేశాం అనేది థియేటర్లో చూడాలి. ప్రేక్షకులు హార్ట్ టచింగ్ ఫీల్తో బయటకు వస్తారు’ అని చెప్పాడు. ఇలాంటి మంచి సబ్జెక్ట్తో ఆడియెన్స్ ముందుకు రావడం ఆనందంగాఉందని నిర్మాత పోలా ప్రవీణ్ అన్నారు.
