
హైదరాబాద్: అంబర్ పేట్లోని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. హైదరాబాద్ నగరంలో గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఓపెనింగ్ కార్యక్రమం పోస్ట్పోన్ అయ్యింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా వెల్లడించారు.
2025, సెప్టెంబర్ 26న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. నగరంలో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్స కార్యక్రమం తిరిగి 2025, సెప్టెంబర్ 28న నిర్వహిస్తామని వెల్లడించారు.
‘‘హైదరాబాద్ నగరానికి శుక్రవారం (సెప్టెంబర్ 26) భారీ వర్షాల హెచ్చరిక కారణంగా అంబర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 28న బతుకమ్మ కుంటను హైదరాబాద్ ప్రజలకు అంకితం చేయనున్నారు’’ అని తెలిపారు.
అంబర్పేట్పరిధిలోని బతుకమ్మ కుంట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఒకప్పుడు ఆక్రమణలకు నిలమయమైన ఈ బతుకమ్మ కుంట హైడ్రా వచ్చాక తిరిగి పునరుజ్జీవనం పోసుకుంది. 7కోట్ల40 లక్షల రూపాయలతో బతుకమ్మ కుంట సుందరీకరణ చేపట్టింది రాష్ట్రప్రభుత్వం. 5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్గార్డెన్ఏర్పాటు చేశారు అధికారులు.
ఇన్లెట్, ఔట్లెట్తో చుట్టూ వాక్ వే, వాక్వే చుట్టూ చెట్లు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. చిల్డ్రన్ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో అందరిని ఆకర్షిస్తోంది. ఇక, అన్ని పనులు ముగించుకొని ప్రారంభోత్సవానికి బతుకమ్మ కుంట రెడీగా ఉంది.
శుక్రవారం(సెప్టెంబర్ 26) సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా సెప్టెంబర్ 26న ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి సెప్టెంబర్ 28న ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.