కామారెడ్డిలో బీసీల మౌన దీక్ష

 కామారెడ్డిలో బీసీల మౌన దీక్ష

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలోని మహాత్మా జ్యోతిబాపూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, చట్టబద్ధంగా 9వ షెడ్యూల్​లో చేర్చి బీసీ ల హక్కులను నెరవేర్చాలన్నారు. తమిళనాడు తరహాలో 50 శాతం సీలింగ్ ఎత్తేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.  ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో  బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.  త్వరలో వెయ్యి మందితో కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. 

త్వరలోనే గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా బీసీల చైతన్యం కోసం యాత్ర చేపడుతామని చెప్పారు. అన్ని సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, పండ్ల రాజు, కన్నయ్య, పున్న రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, మల్లన్న, రాజేందర్, ఇర్ఫాన్, లలిత, మంజుల, రాజయ్య, రాజీవ్, సాయికృష్ణ, బాగయ్య, ఎల్లయ్య, అంజద్, పంపరి లక్ష్మణ్, శ్రీనివాస్, రమేశ్, దయాకర్, అరుణ్, విఠల్, నర్సింహ, నర్సా గౌడ్, నారాయణ, సురేశ్​, శంకర్ తదితరులు పాల్గొన్నారు.