కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకు .. జీటీ–డీసీ పోరు వెనక్కి

కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకు .. జీటీ–డీసీ పోరు వెనక్కి

న్యూఢిల్లీ: ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  రీషెడ్యూల్ చేసినట్టు మంగళవారం ప్రకటించింది. ఈ నెల 17న ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  శ్రీరామ నవమి నేపథ్యంలో ఒక రోజు ముందుకు జరిపింది.

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 16న జరుగుతుందని తెలిపింది. అలాగే, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య 16న జరగాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒక రోజు వెనక్కు జరిపి 17న నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.