
ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగౌని బాలరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లను 30 రోజుల్లో అమలు చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టును గడువు కోరగా, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించిందని గడువులోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సుంగూరి దుర్గయ్య గౌడ్, ఆయిలి వెంకన్న గౌడ్, సింగం నాగేశ్గౌడ్, బైరు శేఖర్, బడేసాబ్, బాలగౌని వెంకటేశ్గౌడ్, పోతగాని ఐలాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.