రాష్ట్రంలో ఎండలు మండితుండటంతో మద్యం ప్రియులు చల్లని బీర్లతో చిల్ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. రాత్రి 7 గంటల వరకే కూల్ బీర్లు అమ్ముడుపోతున్నాయి. దీంతో తమకు నచ్చిన బీర్ దొరక్క మద్యం ప్రియులు ఇబ్బంది పడుతున్నారు.
ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో మే నెలలో బీర్ల అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. బీర్ల ఉత్పత్తిని లిక్కర్ కంపెనీలు పెంచుతున్నాయి. బీర్ల సెల్ వీపరీతంగా పెరగడంతో కూల్ బీర్లు దొరకడం మద్యం ప్రియులకు కష్టం అయిపోయింది.