నువ్వు నిజంగా గ్రేట్ : ఇద్దరు పిల్లల భార్యకు.. ఆమె ప్రేమికుడితో పెళ్లి చేసిన భర్త

నువ్వు నిజంగా గ్రేట్ : ఇద్దరు పిల్లల భార్యకు.. ఆమె ప్రేమికుడితో పెళ్లి చేసిన భర్త

ఉత్తర్ ప్రదేశ్ లోని బెగుసరాయ్‌లో ఓ వ్యక్తి తన భార్యను ఆమె ప్రేమికుడితో వివాహం చేసుకున్నాడు . ఆ మహిళ ఇద్దరు చిన్నారుల తల్లి. అంతే కాదు తన భార్య తన కొత్త జీవిత భాగస్వామికి భారం కాకూడదని భావించిన ఆ వ్యక్తి వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా అంగీకరించాడు. ఈ ఘటన నవంబర్ 14న దహియా గ్రామంలో చోటుచేసుకుంది. అజయ్ కుమార్ (24)కి కాజల్ (22)తో 2018లో వివాహం జరగగా.. వీరి వివాహం అప్పట్లో అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ జిల్లాలోని మన్సూర్ చక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఘాపూర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఠాకూర్ తో టచ్ లో ఉంది. కాజల్, రాజ్ కుమార్.. పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. కాజల్ ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత కూడా వారి మధ్య రహస్యంగా ఎఫైర్ కొనసాగింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ తో తన సంబంధాన్ని తెంచుకోలేకపోయానని కాజల్ తెలిపింది. విషయం తెలుసుకున్న అజయ్.. ఈ సంఘటన గురించి మా కుటుంబసభ్యులు నాకు చెప్పినపుడు మొదట నేను షాక్ అయ్యాను. అయితే ఆమెను నా వైవాహిక బంధం నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఠాకూర్ తో సంబంధం కలిగి ఉన్నందున ఆమెతో ఇంకా కొనసాగడంలో అర్థం లేదు. అందుకే నేను వారి వివాహానికి ఏర్పాటు చేశాను. ఒక దేవాలయంలో వీరి పెళ్లి జరిపించాను అని అజయ్ చెప్పారు.

ఈ సమయంలో అక్కడి స్థానికులు వారికి అడ్డు చెప్పినప్పటికీ.. ఫైనల్ గా.. వారంతా.. ఇది వారి కుటుంబ నిర్ణయమని, గ్రామస్తులు కూడా దానికి అంగీకరించారని పంచాయతీ సర్పంచ్ సహర్ సాహ్ని తెలిపారు.