సరికొత్త కాన్సెప్ట్తో వస్తోన్న "భారత్ కీ నారీ" 

సరికొత్త కాన్సెప్ట్తో వస్తోన్న "భారత్ కీ నారీ" 

దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతతో దేశం కోసం పోరాడుతారు.. అలాగే వారి సతీమణులు కూడా అంతే బాధ్యతతో వారి కుటుంబాలను చూసుకొని రక్షణగా నిలుస్తారు.. అలాంటి తరుణంలో దేశ సైనికుల భార్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం "భారత్ కీ నారీ". ఎం.డీ. నజీర్ ఉద్దీన్ హీరోగా సీతా మహాలక్ష్మీ హీరోయిన్ గా నటించారు. అఖిల్ గంధం సమర్పణలో డీ.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దర్శకుడు డీ.ఎస్ రాథోడ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎం.డీ. నమీర్ ఉద్దీన్ అహ్మద్ తెలుగు, హిందీ భాషల్లో "భారత్ కీ నారీ" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఆగస్టు 15న ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్రం దినోత్సవం సందర్బంగా భారత్ కీ నారీ చిత్రం మోషన్ పోస్టర్ ని లాంఛ్ చేశారు.. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి "భారత్ కీ నారీ" చిత్రం మోషన్ పోస్టర్ లాంఛ్ చేయగా.. మరో అతిథి కల్నల్ రామారావు చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 

అనంతరం బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. "రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక కొత్త కంటెంట్స్ తో మంచి చిత్రాలు వస్తున్నాయి. అలా ఎంతో మంది దర్శకులు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆ కోవలో డీ.ఎస్ రాథోడ్ కూడా చేరాలి. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మిలటరీ బ్యాక్ డ్రాప్ లో చాలా చిత్రాలు వచ్చాయి. ఎమోషనల్ ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్స్ తో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. డెఫినెట్ గా ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది.. అవ్వాలని ఆశిస్తున్నాను. భారత్ కి నారి వంటి మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించాలని దర్శకుడు డీ.ఎస్. రాథోడ్ ఒక చక్కని ప్రయత్నం చేశాడు. ఈ సినిమా చిత్ర యూనిట్ అందరికీ బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. 

దర్శకుడు డీ.యస్. రాథోడ్ మాట్లాడుతూ.. "దేశ బార్డర్ లో సైనికులు ఏవిధంగా దేశాన్ని కాపాడడానికి  బాధ్యత వహిస్తారో అదేవిధంగా వారి సతీమణులు ఒంటరిగా ఉంటూ తమ కుటుంబాన్ని కూడా అంతే బాధ్యతగా చూసుకుంటారు. ప్రేమ, దేశ భక్తి వంటి కాన్సెప్ట్ తో మిలితమైన ఈ చిత్రాన్ని దేశ సైనుకుల సతీమణులకు, వారి తల్లి తండ్రులకు అంకితం చేస్తున్నాము. సెంటిమెంట్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా భారత్ కీ నారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.. ఇప్పటిదాకా యాభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ చివరిలో సినిమాని రిలీజ్ చేస్తాం అన్నారు. 

హీరో ఎండీ.నజీరుద్దీన్ మాట్లాడుతూ.. "మిలటరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాకాశం కల్పించిన దర్శకుడు రాథోడ్ కి నా థాంక్స్. సినిమా చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎక్సలెంట్ గా ఉంది. మిలటరీ ఆఫీసర్ గా నటించడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

హీరోయిన్ సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ.. "సుభద్ర రెడ్డి రాసుకున్న మంచి కథకు రాథోడ్ కమర్షియల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నా మీద నమ్మకంతో దర్శక, నిర్మాతలు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. వారికి నా ధన్యవాదములు అన్నారు.

లెఫ్టినెంట్ కల్నల్ రామారవు మాట్లాడుతూ.. "మిలటరీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు. రాథోడ్ కథ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.