కొత్త పార్లమెంట్​ను రాష్ట్రపతితో ఓపెన్ చేయించాలి: బెల్లయ్య నాయక్

కొత్త పార్లమెంట్​ను  రాష్ట్రపతితో ఓపెన్ చేయించాలి: బెల్లయ్య నాయక్
  • లేకుంటే 28న నిరసన చేపడతం
  •  పీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్​ బెల్లయ్య నాయక్ 

హైదరాబాద్, వెలుగు : కొత్త పార్లమెంట్ బిల్డింగ్​ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఓపెన్ చేయించాలని పీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్​ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 28న గాంధీభవన్​లో నిరసన చేపడతామని.. నెక్లెస్​రోడ్​లోని 125 అడుగుల అంబేద్కర్​ విగ్రహానికి వినతి పత్రమిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్లమెంట్ ​బిల్డింగ్​ను రాష్ట్రపతితో కాకుండా ప్రధానితో ప్రారంభించాలని నిర్ణయించడం దారుణమన్నారు.  రాజ్యాంగం   ప్రకారం  దేశానికి రాష్ట్రపతి మొదటి వ్యక్తి అని గుర్తుచేశారు.

రాష్ట్రపతి కాకుండా ప్రొటోకాల్​లో నాలుగో స్థానంలో ఉన్న ప్రధాని మోడీ పార్లమెంటును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రపతి మహిళ, గిరిజన వ్యక్తి కావడం వల్లే అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతితో పార్లమెంట్​ను ప్రారంభింపజేసేలా అంబేద్కర్ సంఘాలు, దళిత, గిరిజన, ప్రజాస్వామిక సంఘాలు కలిసి రావాలని బెల్లయ్య కోరారు.