Bellamkonda Srinivas: నాంది డైరెక్టర్తో బెల్లంకొండ..సామాజిక అంశాలతో సినిమా షురూ!

Bellamkonda Srinivas: నాంది డైరెక్టర్తో బెల్లంకొండ..సామాజిక అంశాలతో  సినిమా షురూ!

టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas). తనదైన యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్  డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్లో టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్గా టైసన్ నాయుడు నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అలాగే సాయి శ్రీనివాస్ ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ తో రాక్షసుడు 2 సినిమాను చేస్తున్నారు. రాక్షసుడు వంటి క్రైమ్ థ్రిల్లర్ కథతో సాయి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇపుడు రాక్షసుడు 2 వస్తుండటంతో మరోసారి హిట్ అందుకోవడం కన్ఫమ్ అనేలా అంచనాలున్నాయి. అంతేకాకుండా సాయి శ్రీనివాస్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి, వాటిల్లో ఒక సినిమా షూటింగ్ కూడా షురూ చేశాడని తెలుస్తోంది. 

అందులో ఒకటి నాంది సినిమాతో విభిన్నమైన డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల(Vijaykanakamedala) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇవాళ శనివారం నుంచే షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

సామాజిక ఇతివృత్తంతో వస్తోన్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డాక్టర్గా కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో విజయ్ కనకమేడల ఆరోగ్య శాఖలో ఉన్న లోపాలను చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈమూవీలో మెహ్రీన్ హీరోయిన్‌ గా నటిస్తోంది.