కోల్ బెల్ట్, వెలుగు: రౌడీ షీటర్లు తమ నేరప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, సమాజంలో గౌరవంగా బతకాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్సూచించారు. సోమవారం మందమర్రి పోలీస్స్టేసన్లో మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
నడవడికలో మార్పు రాకుంటే చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా గొడవలు, ఆందోళనలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. సీఐ పర్స రమేశ్, ఎస్సైలు శ్రీధర్, గోపతి నరేశ్తదితరులు పాల్గొన్నారు.
