
బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ను ప్రవేశ పెట్టనున్నారు వాహనదారులకు కొంత ఊరట కలిగించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సిగ్నల్ జంప్ చేస్తే చలాన్ లు ఉండవని తెలిపారు. అంబులెన్సెలు వెళ్లే సమయంలో వాటికి దారి ఇచ్చే క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్చేస్తే అలాంటి సమయంలో పోలీసు శాఖ విధించిన జరిమానా రద్దు చేస్తామని తెలిపారు. ఇలాంటి చలాన్లు ఏమైనా ఉంటే ఆధారాలతో ఇన్ఫాంట్రీ రోడ్డులోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ను సంప్రదిస్తే ఫైన్ మాఫీ చేయబడుతుందన్నారు.
ALSO READ | 48 గంటలు ఆస్పత్రి లిఫ్ట్ లో చిక్కుకున్న వ్యక్తి.. ఫోన్ లేదా.. ఎవరూ ఎందుకు చూడలేదు..?
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఎక్కువ సిగ్నల్స్ ఉన్నాయని అంబులెన్స్ వెళ్లేందుకు సిగ్నల్స్ వద్ద చాలా అంతరాయం కలుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) MN అనుచేత్ ... ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి.. ఫైన్ లు వేసే సమయంలో ఎక్కువుగా అంబులెన్స్ కు దారి ఇచ్చేందుకు రూల్స్ ఉల్లంఘించిన కేసులు ఎక్కువుగా ఉన్నాయని గుర్తించారు. ఇలా చలాన్ లు అందుకున్న వారు ఇన్ఫాంట్రీ రోడ్లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. అలాగే లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
సిగ్నల్ జంప్ చేసిన తరువాత ప్రతి కెమెరా 5 సెకన్ల పాటు వాహనాలరు రికార్డు చేస్తుందని వివరించారు. ఆ సమయంలో అంబులెన్స్ వెళితే .. సిగ్నల్ జంప్ చేసి.. చలాన్లు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే రద్దు చేస్తామన్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పది ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్లలో జిపిఎస్తో కూడిన అంబులెన్స్లను గుర్తించేవిధంగా చర్యలు తీసుకున్నారు. ఆకుపచ్చగా మార్చడానికి జియోఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలో 80 అంబులెన్స్లకు జీపీఎస్ను అమర్చినట్లు ఆరోగ్య, సంక్షేమ శాఖ పేర్కొంది.
ALSO READ | డెలవరీ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ : రోజుకు కోటి రూపాయల బాదుడు