పుష్యమి నక్షత్రాన రామయ్యకు పట్టాభిషేకం

పుష్యమి నక్షత్రాన రామయ్యకు పట్టాభిషేకం

భద్రాద్రి రామయ్యకు పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆదివారం పట్టాభిషేకం చేశారు. చామరాలు, ఖడ్గం, డాలు, గద, గొడుగుతోపాటు కిరీటం అలంకరించి ప్రోక్షణ జలాలను రామయ్యపై చల్లి పట్టాభిషేకం నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవ, సువర్ణ పుష్పార్చనలు కనుల పండువగా సాగాయి. బేడా మండపంలో ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం చేశారు.

ఈ క్రతువులో 120 జంటలు పాల్గొన్నాయి. అనంతరం 10 జంటల సమక్షంలో స్వామివారికి పట్టాభిషేకం చేశారు. వేసవి దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఈవో దామోదర్​రావు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో భద్రాద్రి రామయ్యను 1,99,248 మంది భక్తులు దర్శించుకున్నట్లు చెప్పారు.-భద్రాచలం, వెలుగు