భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్ఎగ్జామ్స్పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ఎగ్జామ్స్జరగనున్నట్లు తెలిపారు. జిల్లాలో 37 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్స్టేషన్ల నుంచి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు తీసుకెళ్లే టైంలో భద్రతా నియామాలు పాటించాలన్నారు.
స్టూడెంట్స్ ప్రశాంతంగా పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జామ్స్ జరిగే రోజుల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. నిరంతరంగా కరెంట్ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జామ్ సెంటర్లలో హెల్త్క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్శాఖాధికారి వెంకటేశ్వర రావు, జడ్పీ సీఈవో బి.నాగలక్ష్మితోపాటు అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం..
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకమని కలెక్టర్ జితేశ్వి పాటిల్అన్నారు. పాల్వంచలోని డాక్టర్మన్మోహన్ సింగ్ ఎర్త్సైన్సెస్ యూనివర్శిటీలో రెండో విడత సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివిధ స్కీంల కింద వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.
