
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కరకగూడెం, వెలుగు: గ్రామంలోని పిల్లలు అందరిని ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని, అప్పుడే అన్ని వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం కరకగూడెంలో జడ్పీహెచ్ఎస్లో జిల్లా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పిల్లలందరినీ బడిలో చేర్పించి బలోపేతం చేయాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం కరకగూడెంలో జవహర్ నవోదయ స్కూల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈవో ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఏ.నాగరాజు శేఖర్, కరకగూడెం ఎంఈవో జి.మంజుల, విద్యాశాఖ ఇంజినీరింగ్ డీఈ, ఏఈ, తాహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.