చదువుకునే పిల్లలకు నో టికెట్ .. భగవంత్ కేసరి టీమ్ సూపర్ డిసిషన్

చదువుకునే పిల్లలకు నో టికెట్ .. భగవంత్ కేసరి టీమ్ సూపర్ డిసిషన్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో నటసింహ బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఎమోషనల్ అండ్  కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో భగవంత్ కేసరి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. దీంతో మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.32 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

ఇక భగవంత్ కేసరి సినిమా విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు మేకర్స్. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉందని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆడ పిల్లలకు చెప్పాలని, ఆడవాళ్ళని తక్కువగా చూడొద్దని, వాళ్ళని ఇంకా బలంగా పెంచాలని ఈ సినిమాలో చూపించాం. ఇంత మంచి మెసేజ్ ని బాలకృష్ణ గారితో  చెప్పించడం వాల్ల అందరు అభినందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా సినిమాలోని మంచి మెసేజ్ పిల్లలు అందరికి చేరాలని, ముఖ్యంగా స్కూల్ ఏజ్ ఆడపిల్లలకు చేరాలని భగవంత్ కేసరి టీం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే త్వరలో స్కూల్ పిల్లలకు ఫ్రీ షోలు వేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపారు. త్వరలోన భగవంత్ కేసరి సినిమాను స్కూల్ విద్యార్థినులకు ఫ్రీగా చూపించనున్నారు.