కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చైర్మన్ బి.రమణారావు తెలిపారు. ఈ . వైష్ణవి 581, వి. పర్ణిక 579 మార్కులతో సత్తా చాటారని చెప్పారు.
53 మంది విద్యార్థులకు గాను 39 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్ బి . విజయ లక్ష్మి, అకడమిక్ డైరెక్టర్ ప్రతాప్ సి. రెడ్డి, వైస్ ప్రిన్సిపాళ్లు రామ్మోహన్ రావు, టీచర్స్ అభినందించారు.
