
హైదరాబాద్, వెలుగు: గోల్ఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ), టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత్ గోల్ఫ్ మహోత్సవ్ ‘జీఎఫ్ఐ టూర్ 2025’ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్, కంట్రీ క్లబ్లో మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో 170 మంది గోల్ఫర్లు రెండు సెషన్ల పాటు డబుల్ పియోరియా ఫార్మాట్లో పోటీపడ్డారు. గోల్ఫ్ ఆట పట్ల పెరుగుతున్న ఆసక్తిని, పర్యావరణ స్పృహను చాటిచెబుతూ నిర్వహించిన ఈ ఈవెంట్లో జీఎఫ్ఐ ఫౌండర్ ఆర్యవీర్, ప్యాట్రన్ నిర్మల, చైతన్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫౌండర్ చైతన్య రాజు పాల్గొని
మొక్కలు నాటారు.