‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. మీనాక్షి గోస్వామి హీరోయిన్. పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శనివారం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో సూర్యతేజ మాట్లాడుతూ ‘మంచి సబ్జెక్టుతో నటుడిగా పరిచయం అవడం ఆనందంగా ఉంది.
ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. నన్ను నమ్మిన కేవీఆర్ మహేంద్ర గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు. ఇందులో పార్ట్ అవడం హ్యాపీ అంది మీనాక్షి. కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ‘‘దొరసాని’ తర్వాత ఇలాంటి యూనిక్ ఎంటర్టైనర్తో రావడం ఆనందంగా ఉంది. ఇది రెగ్యులర్ సినిమా కాదు. క్రైమ్ కామెడీ జానర్లో చాలా కొత్త ఎలిమెంట్తో ఇప్పటివరకూ చూడని సరికొత్తగా ఉంటుంది’ అని చెప్పాడు.
అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు నిర్మాత పాయల్. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.