భరతనాట్యం మూవీ ఏప్రిల్ 5న విడుదల

భరతనాట్యం మూవీ ఏప్రిల్ 5న విడుదల

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో  పాయల్ సరాఫ్ నిర్మించిన చిత్రం ‘భరతనాట్యం’. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సమ్మర్ హాలీడేస్‌‌ తమ చిత్రానికి కలిసొస్తుందని టీమ్ చెప్పారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకోగా, సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని మేకర్స్ అన్నారు. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్  సంగీతం అందించాడు.