
తమకు మంత్రి పదవులు ముఖ్యం కాదు ప్రజా సేవే ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా ఫ్యామిలీకే మూడు సీట్లు ఇచ్చారని విమర్శలు చేయడం సరికాదన్నారు. తమకు ప్రజాధరణ ఉంద కాబట్టే మూడు సీట్లు గెలిచామని చెప్పారు వివేక్.
హైదరాబాద్ లో భీం సైనిక్ ఫౌండేషన్ సమ్మేళనంలో మంత్రి వివేక్ కు సన్మానం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కాకా వెంకటస్వామి పేదల కోసమే ఎప్పుడూ ఆలోచించేవారు. కాకా ఏది ఆలోచించేవారో అదే చేసేవారు. ఆ రోజుల్లనే కాకా అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారు. 27 వేల మంది కార్మికులకు ఇంటి స్థలాలు ఇప్పించారు. ప్రైవేట్ సెక్టార్ లో పెన్షన్ తీసుకొచ్చింది కాకానే. కాకా అడుగు జాడల్లోనే మేం నడుస్తున్నాం. పదవులకు ఆశపడకుండా తెలంగాణ ఉద్యమం చేశా. యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నా ఉద్యమం ఆపలేదు.
►ALSO READ | Census 2026: జనాభా లెక్కల తొలి అడుగు..గృహాల లెక్కింపుతో ప్రారంభం
పెద్దపల్లిలో 2 వేల బోర్ వెల్స్ వేయించాం. మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు..ప్రజా సేవ ముఖ్యం.పెద్దపల్లి ప్రజలు మా ఫ్యామిలీని ఏండ్లుగా ఆదరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అన్ని సీట్లు బీజేపీ గెలిస్తే పెద్దపల్లిలో వంశీ గెలిచారు. కాకా ఫ్యామిలీకే 3 టికెట్లు ఇచ్చారని విమర్శలు చేయడం సరికాదు. మాకు ప్రజల ఆదరణ ఉంది కాబట్టే మేం మూడు సీట్లు గెలిచాం అని మంత్రి వివేక్ అన్నారు.