23న భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

23న  భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23న సాయంత్రం 6.30 గంటలకు జరగనుంది. ఈ విషయాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఫంక్షన్ ఉంటుందని ట్వీట్ చేసింది.  పవన్ కల్యాణ్ కూర్చుని టీ తాగుతున్న పోస్టర్ ను రిలజ్ చేశారు.  ఇప్పటికే రిలజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దాదాపు 12 మిలియన్లన వ్యూస్, 1 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి.

‘భీమ్లా నాయక్’లో పవన్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రానా పక్కన సంయుక్తా మీనన్ యాక్ట్ చేస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందించిన భీమ్లాకు.. టాప్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చాడు. మలయాళ సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలోనూ అదేరోజున అలరించడానికి పవన్, రానాలు రెడీ అవుతున్నారు.