యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా వలిగొండలోని రైస్మిల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు, తాలు, తరుగు పేరుతో కటింగ్, అన్లోడింగ్, నిల్వలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన వడ్లు మిల్లుల్లో ఉండడంతో స్పేస్ ప్రాబ్లం ఏర్పడిందన్నారు. కేంద్రం సీఎంఆర్ను సేకరిస్తే ఈ ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇప్పటికైనా వెంటనే ఎఫ్సీఐ సేకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట డీసీఎస్వో రోజా రాణి ఉన్నారు.
