నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థుల సంక్షేమానికి మరో ముందడుగు వేశారని ఎంపీ మల్లురవి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ఆవరణలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి తో కలిసి పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు త్వరలోనే షూలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
