ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలను చూసి జనాలకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ కి మద్దతుగా . పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ గా ఎంతో గొప్ప పేరు ఉన్న ప్రశాంత్ కిషోర్ నారాలోకేష్ తో కలిసి విజయవాడ విమానాశ్రయం లో ప్రశాంత్ కిషోర్ కనిపించడంతో వైసీపీ నాయకులు షాక్నకు గురయ్యారు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఆ స్థాయిలో ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అని బాహాటంగానే చర్చ జరిగింది.
నారాలోకేష్ తో కలిసి ఒకే వాహనం లో ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. రాబొయ్యే ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలి, టీడీపీ - జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలి, ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు పోవాలి అనే దానిపై చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరపబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ ని కూడా కలవబోతున్నట్టు సమాచారం. పీకే సలహాలతో టీడీపీ - జనసేన ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
.@IndianPAC founder @PrashantKishor arrives in Vijayawada and goes along with @naralokesh to meet @JaiTDP president @ncbn ? Is anything interesting brewing? Does he see a rout of @ysjagan and @YSRCParty ?? Is he betting on @ncbn as the winning horse in #AndhraPradesh ? We need to… pic.twitter.com/dY5M90TBdr
— Saye Sekhar Angara (@sayesekhar) December 23, 2023