బిగ్​ బ్రేకింగ్​: చంద్రబాబుతో ప్రశాంత్​ కిషోర్​ భేటి

బిగ్​ బ్రేకింగ్​:  చంద్రబాబుతో ప్రశాంత్​ కిషోర్​ భేటి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలను చూసి జనాలకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.   గత ఎన్నికల్లో వైఎస్సార్​సీపీ  పార్టీ కి మద్దతుగా . పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ గా ఎంతో గొప్ప పేరు ఉన్న ప్రశాంత్ కిషోర్ నారాలోకేష్ తో కలిసి విజయవాడ విమానాశ్రయం లో ప్రశాంత్ కిషోర్ కనిపించడంతో వైసీపీ నాయకులు షాక్​నకు గురయ్యారు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఆ స్థాయిలో ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అని బాహాటంగానే చర్చ జరిగింది. 

నారాలోకేష్ తో కలిసి ఒకే వాహనం లో ప్రశాంత్​ కిషోర్​  ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. రాబొయ్యే ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలి, టీడీపీ - జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలి, ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు పోవాలి అనే దానిపై చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరపబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ ని కూడా కలవబోతున్నట్టు సమాచారం.  పీకే  సలహాలతో టీడీపీ - జనసేన ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.