నితీష్ కుమార్ బీజేపీతో టచ్లోనే ఉన్నరు : పీకే

నితీష్ కుమార్ బీజేపీతో టచ్లోనే ఉన్నరు : పీకే

ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్.. ఇంకా బీజేపీతో టచ్లోనే ఉన్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అవసరం అయితే మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చెప్పారు.  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ద్వారా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అన్నారు.

‘‘నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ బీజేపీతో స్నేహానికి నితీష్ తలుపులు తెరిచే ఉంచారు. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకున్నప్పటికీ హరివంశ్ను రాజీనామా చేయమనలేదు. పరిస్థితులు మారితే ఆయన మళ్లీ బీజేపీతో కలిసి పనిచేస్తారు’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

పీకే వ్యాఖ్యలను జేడీయూ ఖండించింది. నితీష్ ఇంకెప్పుడూ బీజేపీతో చేతులు కలపరు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.