మియాపూర్ లో తాగుడుకు బానిసై చోరీలు .. బైకులు దొంగిలిస్తున్న ముఠా అరెస్టు

మియాపూర్ లో తాగుడుకు బానిసై చోరీలు .. బైకులు దొంగిలిస్తున్న ముఠా అరెస్టు

మియాపూర్​, వెలుగు: తాగుడుకు బానిసై బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కొల్లూరు డబుల్ బెడ్రూంలో నివాసముండే శ్రీకాంత్(24), మియాపూర్​ గోకుల్ ప్లాట్స్​లో ఉండే వెంకటేశ్వర్లు(23), వేణు(20), అఖిల్​రెడ్డి(23) స్నేహితులు. వీరు మద్యం, గంజాయికి అలవాటుపడ్డారు. జల్సాలు చేసేందుకు చోరీలు చేయాలని డిసైడ్​ అయ్యారు. పార్కింగ్​ ప్రదేశాలు, ఇండ్ల ముందు పార్క్​ చేసిన వాహనాలను టార్గెట్​ చేసేవారు. 

దొంగిలించిన బైకులను ఏపీకి తీసుకెళ్లి రూ.15 వేల నుంచి రూ.20 వేలకు అమ్మేస్తున్నారు. కొన్ని బైకులను పార్టులుగా విడదీసి స్క్రాప్​లో అమ్మేవారు. ఈ నెల 10న మియాపూర్​ ఆర్టీసీకాలనీలో రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైకును చోరీ చేశారు. బాధితుడు మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా నలుగురిని పట్టుకున్నారు. వారిని విచారించగా చోరీలను ఒప్పుకున్నారు. వీరి వద్ద రూ.30 లక్షల విలువైన 13 బైకులు, 406 సెంట్రింగ్​ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్​, వెంకటేశ్వర్లు గతంలోనూ పోలీసు కేసులున్నాయి.