
మియాపూర్, వెలుగు: తాగుడుకు బానిసై బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కొల్లూరు డబుల్ బెడ్రూంలో నివాసముండే శ్రీకాంత్(24), మియాపూర్ గోకుల్ ప్లాట్స్లో ఉండే వెంకటేశ్వర్లు(23), వేణు(20), అఖిల్రెడ్డి(23) స్నేహితులు. వీరు మద్యం, గంజాయికి అలవాటుపడ్డారు. జల్సాలు చేసేందుకు చోరీలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్కింగ్ ప్రదేశాలు, ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాలను టార్గెట్ చేసేవారు.
దొంగిలించిన బైకులను ఏపీకి తీసుకెళ్లి రూ.15 వేల నుంచి రూ.20 వేలకు అమ్మేస్తున్నారు. కొన్ని బైకులను పార్టులుగా విడదీసి స్క్రాప్లో అమ్మేవారు. ఈ నెల 10న మియాపూర్ ఆర్టీసీకాలనీలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకును చోరీ చేశారు. బాధితుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా నలుగురిని పట్టుకున్నారు. వారిని విచారించగా చోరీలను ఒప్పుకున్నారు. వీరి వద్ద రూ.30 లక్షల విలువైన 13 బైకులు, 406 సెంట్రింగ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్, వెంకటేశ్వర్లు గతంలోనూ పోలీసు కేసులున్నాయి.