
జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని సూరారం పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్కు చెందిన దుండిరాజు, అన్నారానికి చెందిన విజయకుమార్ రాజు, గాజులరామారానికి చెందిన సాయి, దుండిగల్కు చెందిన కె. రవి కలిసి ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నారు.
దుండిగల్లో నాలుగు, సూరారం, సనత్నగర్ లో మూడు చొప్పున, మాదాపూర్ ఒక బైక్ దొంగలించారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఈ నలుగురిని అరెస్ట్ చేసి, రూ.15 లక్షల విలువ చేసే 11 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శంకర్రెడ్డి తెలిపారు.