బైక్ దొంగలు అరెస్ట్.. 11 బైకులు స్వాధీనం

బైక్ దొంగలు అరెస్ట్.. 11 బైకులు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని సూరారం పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌కు చెందిన దుండిరాజు, అన్నారానికి చెందిన విజయకుమార్ రాజు, గాజులరామారానికి చెందిన సాయి, దుండిగల్‎కు చెందిన కె. రవి కలిసి ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నారు.  

దుండిగల్‎లో నాలుగు, సూరారం, సనత్‌నగర్ లో మూడు చొప్పున,  మాదాపూర్ ఒక బైక్ దొంగలించారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఈ నలుగురిని అరెస్ట్ చేసి, రూ.15 లక్షల విలువ చేసే 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శంకర్​రెడ్డి తెలిపారు.