బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం
  • 1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను గాంధేయవాది వినోబా భావేకు అప్పగించారు.
  •     ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన అన్​టూ ది లాస్ట్ అనే ​గ్రంథం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది.
  •     సర్​ జాన్​ రస్కిన్​ రచన అయిన అన్​ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువాదం చేశారు. 
  •     భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా ఉద్భవించాయి. 
  •     సర్వోదయ సమితి మొదటి సమావేశం 1949లో మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జరిగింది. 
  •     సర్వోదయ సమితి రెండో సమావేశం 1950లో ఒడిశాలోని అంగుల్​లో జరిగింది. 
  •     సర్వోదయ సమితి మూడో సమావేశం హైదరాబాద్​లోని శివరాంపల్లిలో జరిగింది. ఈ సమావేశం 1951, ఏప్రిల్​ 8 నుంచి 11 వరకు జరిగింది. 
  •     శివరాంపల్లి గ్రామంలో జరిగిన సర్వోదయ సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా వినోబా భావే హాజరయ్యారు. 
  •     శివరాంపల్లిలో సర్వోదయ సమితి సమావేశం అనంతరం వినోబా భావే ఏప్రిల్​ 15న తెలంగాణ పర్యటనను ప్రారంభించారు.
  •     వినోబా భావే తెలంగాణ పర్యటనలో ఆయన వెంట నడిచిన ముఖ్య నాయకులు మర్రి చెన్నారెడ్డి, మేల్కోటే.
  •     1951, ఏప్రిల్​ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వినోబా భావే సమక్షంలో 100 ఎకరాలభూమిని దానంగా ఇస్తున్నట్లు భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి ప్రకటించారు. 
  •     నల్లగొండ జిల్లా భువనగిరి తాలుకా పోచంపల్లిలో భూదానోద్యమం పుట్టింది. 
  •     భూస్వాములు తమ భూమిలో 1/ 6 వంతు భూమిని నిరుపేదలకు దానం చేయాలని వినోబా భావే సూచించారు. 
  •  తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుకా నాగిళ్ల గ్రామంలో ఒక పేద రైతు దానం చేశాడు.
  •     హైదరాబాద్​ స్టేట్​ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనం 1951, జూన్​ 7న ఆదిలాబాద్​ జిల్లా మంచిర్యాలలో జరిగింది. 
  •     దానంగా ఇచ్చిన భూమిని పంచడానికి, ఆ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి 1951, జూన్​ 7న వినోభా బావే భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు. 
  •     భూదాన యజ్ఞసమితి కన్వీనర్​గా ఉమ్మెత్తల కేశవరావును నియమించారు. 
  •     భూదాన యజ్ఞ సమితి సభ్యులు కేతిరెడ్డి కోదండరాంరెడ్డి, సంగం లక్ష్మీబాయి.
  •     1951, జూన్ 7న ఆదిలాబాద్​ జిల్లా మంచిర్యాలలో జరిగిన హైదరాబాద్​ స్టేట్​ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్​ రాష్ట్ర రెవెన్యూ మంత్రి బి. రామకృష్ణారావు హాజరయ్యారు. 
  •     హైదరాబాద్​ రాష్ట్రం భూదానానికి సంబంధించిన చట్టాన్ని 1951లో  ఆమోదించింది. 
  •     వినోబా భావే తెలంగాణలో తన మొదటి పాదయాత్రలో 12,000 ఎకరాల భూమిని దానంగా పొందాడు.
  •     శంకర్​రావు దేవ్​ 1952లో మెదక్​ జిల్లాలో పర్యటించి 15 రోజుల్లో 4000 ఎకరాల భూమిని దానంగా పొందారు.
  •     1954లో తెలంగాణలో రెండుసార్లు పర్యటించిన కృష్ణదాస్​ జాజూ సర్వోదయ కార్యకర్తలకు ప్రేరణ కలిగించారు.
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో జయప్రకాశ్​ నారాయణ 1952, ఆగస్టులో పర్యటించారు. 
  •     తెలంగాణలో వినోబా భావే భూదానోద్యమ రెండో యాత్ర 1955, డిసెంబర్ లో ఖమ్మం జిల్లా ముత్తుగూడెం నుంచి ప్రారంభమైంది. ఈయనకు హైదరాబాద్​ సీఎం బూర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థ మొదలైన వారు స్వాగతం పలికారు. 
  •     హైదరాబాద్​ చివరి నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ వినోబా భావే మొదటి భూదాన యాత్ర సందర్భంగా 3500 ఎకరాలు భూమిని దానంగా ఇచ్చాడు. 
  •     1956, ఫిబ్రవరి 8న వినోభా బావే పాల్మాకోల్​ గ్రామానికి చేరుకున్నప్పుడు ఆయనతోపాటు అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్​ భూదాన ఉద్యమ యాత్రలో పాల్గొన్నాడు. 
  •     వినాబా భావే భూదాన ఉద్యమ యాత్రలో భాగంగా 1956 , మార్చి 5న మాధరావుపల్లెలో జరిగిన కార్యక్రమంలో అప్పటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ పాల్గొన్నారు.
  •     వినోబా భావేను కమ్యూనిస్టులు సర్కారు సాధు అని విమర్శించారు.
  •     భూదానం ద్వారా సేకరించిన భూమిని 1996 వరకు భూమిలేని వారికి పంపిణీ చేశారు. 
  •      దేశవ్యాప్తంగా వినోబా భావే 13 సంవత్సరాల్లో 36,500 మైళ్లు పాదయాత్ర చేసి 40.4 మిలియన్ల ఎకరాల భూమిని దానంగా పొందారు.
  •     భూదాన యజ్ఞ బోర్డు ద్వారా భూమిలేని వారికి ఒక ఎకరం మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి పంపిణీ చేశారు.