ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసిండు.. కేటీఆర్​పై బీజేపీ ట్వీట్​

ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసిండు.. కేటీఆర్​పై బీజేపీ ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతి గొప్ప ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్​ఫోజులు కొట్టారని బీజేపీ ఆరోపించింది. విదేశీ యాత్రలకు కొన్ని వందల కోట్లు తగలేసిన కేటీఆర్​ చేసిందల్లా ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేయడమేనని ఆదివారం ఓ ట్వీట్ లో మండిపడింది. ‘‘బీఆర్ఎస్ పాలించిన పదేండ్లలో ఒక్క స్టార్టప్ ను కూడా స్థాపించిన దాఖలాలు లేవని తెలంగాణ ఐటీ బ్యూరోక్రటిక్ హెడ్​జయేశ్​ రంజన్​అంటున్నారు. టీహబ్, వీహబ్ లాంటివి స్థాపించామని డాబులు పోయిన అప్పటి ఐటీ శాఖ మంత్రి.. అవన్నీ తన సొంత ప్రయోజనాలు, పబ్లిసిటీ కోసం చేసినవేనని చెప్తున్నారు. ఆ సంస్థల వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు ఎవరూ లేరని జయేశ్​ రంజన్​ వాపోయారు’’ అని బీజేపీ ట్వీట్​లో పేర్కొంది..