రెండో రౌండ్‌లోనూ బీజేపీ, టీఆర్ఎస్ పోటీపోటీ

రెండో రౌండ్‌లోనూ బీజేపీ, టీఆర్ఎస్ పోటీపోటీ

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తైంది. ఈ రౌండ్‌లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 35,171 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 32,558 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌కు 16,957 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 10,062 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ప్రస్తుతం 2,613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రెండో రౌండ్‌లో వాణీదేవికి 17,732 ఓట్లు, రాంచందర్ రావుకు 16,173 ఓట్లు, చిన్నారెడ్డికి 4,980 ఓట్లు, నాగేశ్వర్‌కు 8,594 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్‌లోనూ 3,375 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దాంతో ఫస్ట్, సెకండ్ రౌండ్లలో కలిపి 6,749 చెల్లని ఓట్లు పోలయ్యాయి.