నాగాలాండ్, మేఘాలయ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. మరో 40 స్థానల్లో తమ కూటమిలో భాగమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)కి ఇచ్చినట్లుగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు టెమ్జెన్ ఇమ్నా తెలిపారు. ఇమ్నా అలోంగ్టాకీ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
మేఘాలయలో మొత్తం 60 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 27న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మార్చి 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.