జగన్ బాబూ ఆ స్టిక్కర్లేంటి.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన సోము వీర్రాజు

జగన్ బాబూ ఆ స్టిక్కర్లేంటి.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన సోము వీర్రాజు

ఏపీ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య రోజురోజుకు మాటల యుద్దం పెరుగుతోంది.  ఈ క్రమంలో సీఎం జగన్ కు లేఖరాసారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు. కేంద్రం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం జగన్ స్టిక్కర్లేంటి లేఖలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఏంటి? అంటూ నిలదీశారు సోము వీర్రాజు.. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్పు అని హితవుపలికారు.. ఈ తరహా ప్రచారాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని సూచించారు..

కేంద్ర ప్రభుత్వమే ఉచిత బియ్యం ఇస్తున్నట్లుగా ఇంటింటికి ఇస్తున్న రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులను ప్రదర్శించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు సోము వీర్రాజు.. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు.  కేంద్రం నిధుల విషయంలో బీజేపీ నేతలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు ఆదినుంచి కొనసాగుతూనే ఉన్నాయి.. కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకుంటూ.. కనీసం కేంద్రం పేరు ప్రస్తావించకుండా.. తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.