మజ్లీస్ మతవిద్వేషాలు కావాలా?..ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలా?

మజ్లీస్ మతవిద్వేషాలు కావాలా?..ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలా?

మజ్లీస్ చేసే మతవిద్వేషాలు కావాలా? లేక ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలో పాతబస్తీ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్.పాతబస్తీ కారణంగా పాతబస్తీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పాతబస్తీలో ఎంఐఎం గుండాల చేతిలో నలిగిపోయింన హిందువులకు అండగా ఉండడం కోసమే భాగ్యలక్ష్మ ఆలయం నుంచి పాతయాత్ర ప్రారంభించామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజులో భాగంగా..బాపు ఘాట్ వద్ద మాట్లాడిన బండి సంజయ్..  పాతబస్తీని వదిలిన హిందువులు మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.  టీఆర్ఎస్ మజ్లీస్ రెండూ ఒక్కటేనన్నారు. పార్ట్నర్ షిప్ లతో పేద ప్రజలను టీఆర్ఎస్... మజ్లీస్ లు మోసం చేస్తున్నాయన్నారు. ఉప ఎన్నిక సమయంలో మాత్రమే కేసీఆర్ బయటకు వస్తున్నారన్నారు. 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తామని చెప్పినా  రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.. ఇక డబుల్ బెడ్ రూమ్ లు ఏం కడతారని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకం  రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక, సిబ్బంది లేక పేద ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భాకీ పడిందన్నారు.  ఆరోగ్యశ్రీ కూడా  రాష్ట్రంలో సరిగా పని చేస్త లేదన్నారు.