కేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 కేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు :  ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

కవితను జైలు నుంచి విడిపించుకోవడాని కేసీఆర్ బీజేపీతో కుమ్మకయ్యారన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న బీజేపీకి ప్రజలు ఓటుతో  గుణపాఠం చెప్పాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం లైన్స్ క్లబ్ మెంబర్స్ ను కలిసిశారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి  వచ్చానన్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ. వివేక్ వెంకటస్వామి రామగుండానికి ఎరువుల ఫ్యాక్టరీ తీసుకోస్తే అందులో ఉద్యోగాలను బీఆర్ఎస్  నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి..ఎంపీగా తనని గెలిపించాలని లయన్స్ క్లబ్ సభ్యులను కోరారు వంశీకృష్ణ.