రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి

రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి

రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నా  రాజకీయ జీవితంలో ఇంత సానుకూల వాతావరణం ఎప్పడూ చూడలేదన్నారు. బీజేపీకి ఇప్పుడున్న ఆదరణ గతంలో లేదన్నారు. దేశభవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయ్యాలని ఓటర్లను కోరారు. 

కాంగ్రెస్ హయాంలో అవినీతి కుంభకోణాలు సాధారణం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి, కుంభకోణాలు దేశ ప్రజలను గాయపర్చాయన్నారు. మోదీపాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా లేదన్నారు. 

2014 కు ముందు హైదరాబాద్ బాంబు పేలుళ్లు ఉండేవి.. టెర్రరిజం విషయంలో మోదీ ప్రభుత్వానిది జీరో టోలరెన్స్ అని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ఐదవ స్థానానికి ఎదిగిందన్నారు. ఎవరూ ఊహించని రీతితో బ్రిటన్ లాంటి దేశాలను వెనక్కి నెట్టి ఆర్థికంగా బలపడిందన్నారు. మాన్యుఫాక్ఛరింగ్ హబ్ గా ఇండియా  మారబోతుందన్నారు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ ను ఇన్వాల్స్ చేసి దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. 

మహిళల సాధికారత విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు కిషన్ రెడ్డి. డిఫెన్స్ తో సహా అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.సైనిక స్కూళ్లలో అడ్మిషన్లు ఇస్తున్నామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. ముస్లిం మహిళల గౌరవాన్ని పెంచేవిధంగా త్రిపుల్ తలాక్ ను రద్దు చేశామన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను ముస్లిం మహిళాలోకం యాక్సెప్ట్ చేసిందన్నారు కిషన్ రెడ్డి.