
పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి 2023 సెప్టెంబర్ 15న పర్యటించారు. ధర్మారంతో పాటు కమ్మరి ఖాన్ పెట్, ఖానంపెల్లి గ్రామాల్లో పర్యటించి బీజేపీ జెండాను ఎగురవేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ధర్మారంకు చెందిన బొమ్మగాని శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను వివిక్ వెంకట స్వామి పరామర్శించారు.