ఎంపీ టికెట్ల ఖరారుపై బీజేపీ కసరత్తు

ఎంపీ టికెట్ల ఖరారుపై బీజేపీ కసరత్తు

 హైదరాబాద్​, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీలో కసరత్తు కొనసాగుతోంది. మొదటి జాబితాలో రాష్ట్రం నుంచి 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందులో 3 సిట్టింగ్ సీట్లతో పాటు మరో 3 స్థానాలు ఉండనున్నాయి. మంగళవారం రాత్రి ఢిల్లీలో రాష్ట్ర నేతలు సమావేశమై టికెట్ల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్​తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న చంద్రశేఖర్ తివారి పాల్గొన్నారు.

ఫస్ట్ లిస్టులో 6 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేలా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వీరు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఫిబ్ర వరి మొదటి వారంలో బీజేపీ ఫస్ట్ లిస్టు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ తిరిగి పోటీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే సిట్టింగ్ స్థానా ల్లో ఆదిలాబాద్ స్థానాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.

ఇక్కడ ఈసారి సోయం బాపురావుకు కాకుండా కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశంఉందని చెప్తున్నారు. ఇక చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్​నగర్ నుంచి డీకే అరుణ, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్​ అభ్యర్థిత్వాలు కూడా దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. ఈటల రాజేందర్ మల్కాజిగిరి టికెట్ ఆశిస్తుండగా.. ఆయనను మెదక్ నుంచి పోటీ చేయించే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు చెప్తున్నారు.