
ముషీరాబాద్, వెలుగు: 1975లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుందని, దేశ చరిత్రలో అదో చీకటి అధ్యాయమని మద్దూరి సంజీవ్ రాజ్ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి, రెండేండ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయనను బుధవారం రాంనగర్లో బీజేపీ నాయకులు సన్మానించారు.
ఈ సందర్భంగా సంజీవ్ రాజ్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విషయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయిన వారిని మోదీ ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలని కోరారు. నేతలు గుండ గౌని భరత్ గౌడ్, పూసరాజు, రమేశ్ రామ్, వెంకటరమణి పాల్గొన్నారు.