ఈడీ, సీబీఐ, ఐటీలతో టార్గెట్ చేస్తున్రు : రోహిత్ రెడ్డి

ఈడీ, సీబీఐ, ఐటీలతో టార్గెట్ చేస్తున్రు : రోహిత్ రెడ్డి

బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఐటీలతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తన పరిధిలోకి రాని కేసును ఈడీ నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంతటి పోరాటానికైన  తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

ఒకసారి కోర్టుకు ఆధారాలు అందితే అవన్నీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చినట్టేనని రోహిత్ రెడ్డి తెలిపారు. చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా అధికారుల తీరు ఉందన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.