ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది : బోయిన్ పల్లి ప్రవీణ్ రావు

ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది : బోయిన్ పల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యలపై నిరసన తెలపాలనుకునే ప్రతిపక్ష పార్టీలను ఒకరోజు ముందుగానే అదుపులోకి తీసుకునే పోలీసులు.. కొందరు నడిరోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తుంటే ఇంటెలిజెన్స్​, పోలీసులు ఏంచేస్తున్నారని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇల్లు, క్యాంప్ ఆఫీసు ముందు కొందరు రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ ర్యాలీ తీయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు రాపర్తి ప్రసాద్, డాక్టర్ పవన్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

దాడి యత్నాన్ని ఖండిస్తున్నాం

వేములవాడ, వెలుగు :  కరీంనగర్​ పార్లమెంట్​ సభ్యుడు బండి సంజయ్​ఆఫీసుపై కొందరు దాడి చేయడానికి యత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వేములవాడలో మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనాన్ని, హిందువుల ఐకత్యను జీర్ణించుకోలేక దాడులకు యత్నిస్తున్నారన్నారు.