
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత మాగం రంగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం (జూన్4) ఉదయం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాగం రంగారెడ్డి తుది శ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా మాగం రంగారెడ్డి పనిచేశారు. మాగం రంగారెడ్డి మృతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకునే బాధ్యతను మాగం రంగారెడ్డి నిర్వహించారు.
మాగం కుటుంబానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీనేత ఈటెల రాజేందర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.