జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?
  • ఆర్టీఐ ద్వారా అడిగిన బీజేపీ నేత మనోహర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న  వివిధ పత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ పై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా సమాచార శాఖను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కోరారు. ప్రభుత్వం తరఫున ఏ ఏజెన్సీ ద్వారా ఏయే పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు? ఎన్ని భాషల పేపర్లకు ఇచ్చారు? వాటికి చేసిన ఖర్చులపై పూర్తి వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 2 రాష్ట్ర సర్కారు భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. ఈ యాడ్స్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకే ఇచ్చారన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తల కోసం...

నేటికీ పూర్తికాని రామప్ప – ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నెల్ ​పనులు

ఇయ్యాల, రేపు మోస్తరు వానలు