హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొట్టగా, మరోవైపు జోరుగా వానలు కురిశాయి. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా టెంపరేచర్లు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో 45.5, జగిత్యాలలోని ఎండపల్లి, కరీంనగర్లోని జమ్మికుంటలో 45.1, రాజన్న సిరిసిల్లలోని వట్టెంలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు చోట్ల సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వానలు పడ్డాయి. సూర్యాపేటలోని ఆత్మకూరులో 6.1 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెంలోని బూర్గంపహాడ్లో 5.3, నల్లగొండలోని నాంపల్లిలో 5.2సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.
మరిన్ని వార్తల కోసం...