కేసీఆర్ మనిషనుకుని ఓట్లేశాం.. అదే మా మొదటి తప్పు

కేసీఆర్ మనిషనుకుని ఓట్లేశాం.. అదే మా మొదటి తప్పు

సీఎం కేసీఆర్ మనిషనుకుని ఓట్లు వేయడమే తమ మొదటి తప్పన్నారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. సీఎంకు కర్రు కాల్చి వాతలు పెట్టె రోజు వచ్చిందన్నారు. ఎమ్మెల్సీగా  ప్రేమేందర్ రెడ్డి గెలిస్తే బీజేపీ కార్యకర్తలు గెలిచినట్టేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బాధలు చెప్పుకోవడానికి వచ్చిన పీల్డ్ అసిస్టెంట్లను కుక్కలతో పోల్చిన కేసీఆర్ తమకు లేదనుకుని కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు. తెలంగాణా రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న సీఎం తన కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. ఈ రాష్ట్రంలో మోసం చేసే వాళ్లే ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారన్నారు. బ్యాలెట్ పేపర్లో 71 మందిలో మొదటి పెరు తనది కావడం  అదృష్టమన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ .