కేటీఆర్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మిగిలిపోక తప్పదు

కేటీఆర్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మిగిలిపోక తప్పదు

హైదరాబాద్: టీఆర్ఎస్ ను ప్రశాంత్ కిషోర్ తృణమూల్ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూసి టీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. అందుకే టీఆర్ఎస్ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ మద్దతు పొందడానికే సోనియా రేవంత్ ను పీసీసీ ప్రెసిడెంట్ చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా

కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసమే ధాన్యం రగడ