కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయనడం సరికాదు

కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయనడం సరికాదు

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయనడం సరైంది కాదన్నారు బీజేపీ నేత విజయశాంతి.  కాంగ్రెస్ మొత్తం ఓట్లు TRSకు వెయ్యడం కారణంగానే ..అధికార పార్టీ 24 వేల పైచిలుకు ఓట్లతో  మాత్రమే ఓడిందన్నారు. అలా కాకుండా  కాంగ్రెస్ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థికే వేసి ఉంటే TRS కచ్చితంగా 75 వేల ఓట్ల పైన తేడాతో ఓడి ఉండేదన్నారు. కేసీఆర్  పట్ల ప్రజల్లో ఆ స్థాయి వ్యతిరేకత ఉందని టీఆరెస్ నేతలు ఇంకా గుర్తించకపోవడం వారి అమాయకత్వమన్నారు. 

TRS అంతర్గత వ్యవహారమే అయినా... ఈ సీఎం హామీలు, పిచ్చి పిచ్చి మాటలపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయి కామెడీగా తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. అంతేకాదు..కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి కొంత బాగుపడే అవకాశం ఉండవచ్చని నిన్నటి నుంచి వార్తలు ఎక్కువగా విన్పిస్తున్నాయని తెలిపారు విజయశాంతి.